ETV Bharat / international

ఆ వెబ్​సిరీస్ చూసినందుకు కిమ్ శిక్ష- ఒకరికి మరణదండన.. మరొకరికి...

author img

By

Published : Nov 25, 2021, 2:05 PM IST

Updated : Nov 25, 2021, 3:26 PM IST

నెట్​ఫ్లిక్స్​లో సూపర్​హిట్​గా నిలిచిన ఓ వెబ్​సిరీస్​ను తమ దేశంలోకి స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించింది ఉత్తరకొరియా. ఈ సిరీస్​ను యూఎస్​బీలో కాపీ చేసినందుకు ఓ పాఠశాల విద్యార్థికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. వెబ్​సిరీస్​ చూసిన అతని స్నేహితులను ఐదేళ్ల పాటు జైల్లో ఉంచాలని ఆదేశించింది(north korea squid game).

Squid Game, స్క్విడ్ గేమ్​
ఆ వెబ్​సిరీస్ చూసినందుకు కిమ్ శిక్ష- ఒకరికి మరణశిక్ష, మరొకరికి జీవితఖైదు

ఉత్తర కొరియాలో కిమ్​జాంగ్​ ఉన్ నియంతృత్వ పాలన ఎంత అరాచకంగా ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగుచూసింది. నెట్​ఫ్లిక్స్​లో విడుదలై సూపర్​హిట్​గా నిలిచిన 'స్క్విడ్ గేమ్'​ వెబ్​ సిరీస్​ను తమ దేశంలోకి అక్రమ రవాణా చేసిన ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది కిమ్ సర్కార్. అతడ్ని కాల్చి చంపాలని ఆదేశించింది. అంతేగాక ఈ సిరీస్​ను యూఎస్​బీలో కాపీ చేసుకున్నందుకు ఓ హైస్కూల్ విద్యార్థికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. స్క్విడ్​ గేమ్​ చూసిన అతని ఆరుగురు స్నేహితులను ఐదేళ్లు జైలులో ఉంచాలని ఆదేశించింది. అంతేగాక వీరిని పర్యవేక్షించే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. వారు మారుమూల గునుల్లో కూడా పని చేయకుండా నిషేధం విధించింది. ఉత్తర్​ హాంగ్యోంగ్​లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది(north korea squid game).

శత్రు దేశం నుంచి వచ్చిందని...

దక్షిణ కొరియా ఇతివృత్తంగా రూపొందించిన స్క్విడ్ గేమ్​ కారణంగా పిల్లలు చదువు నుంచి దృష్టి మళ్లించే అవకాశముందనే సాకుతో ఆ వెబ్​సిరీస్​ను తమ దేశంలో నిషేధించింది ఉత్తరకొరియా(north korea news). దీన్ని చూసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించింది. అయితే ఓ వ్యక్తి ఈ సిరీస్​ను అక్రమంగా ఉత్తర కొరియాలోని రవాణా చేశాడు. దాన్ని ఓ హైస్కూల్ విద్యార్థికి రహస్యంగా విక్రయించాడు. యూఎస్​బీ డ్రైవ్​లో అతడు వెబ్​ సిరీస్​ను కాపీ చేసుకున్నాడు. అనంతరం స్కూల్​కు వెళ్లాక తన బెస్ట్​ ఫ్రెండ్​కు ఆ విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా స్క్విడ్ గేమ్ సిరీస్ చూశారు(north korea squid game news). అయితే విద్యార్థి మిత్రుడు తాము సిరీస్​ చూసిన విషయాన్ని మరొకరికి చెప్పాడు. ఇలా మొత్తం ఆరుగురు దీన్ని వీక్షించారు. ప్రభుత్వం సెన్సార్ల ద్వారా ఈ విషయాన్ని పసిగట్టింది. విచారణ జరిపి అందరికీ శిక్ష విధించింది. అయితే ధనికుడి కుమారుడు కూడా ఈ సిరీస్ చూసినప్పటికీ 3000డాలర్లు అధికారులకు లంచంగా ఇవ్వడం వల్ల అతని పేరు బయటకు రాలేదనే ప్రచారం జరుగుతోంది(squid game news).

ఏంటీ స్క్విడ్ గేమ్?

నెట్​ఫ్లిక్స్​లో సెప్టెంబర్ 17న విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది(squid game north korea). గత రికార్డులను చెరిపేసి కోట్లు వీక్షణలు కొల్లగొట్టింది. ఇప్పటి వరకు మరే సిరీస్​కు రానంత ప్రేక్షకాదరణ చూరగొంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి జీవితం మీది విరక్తి చెందిన 456 మంది ఓ గేమ్​లో పాల్గొనడమే ఈ సిరీస్ ఇతివృత్తం. గెలిచిన వారికి 38 మిలియన్​ డాలర్లు(రూ.283కోట్లు) ప్రైజ్ మనీ దక్కుతుంది. కానీ ఓడిపోతే మాత్రం చావే శరణ్యం. జంప్ సూట్ ధరించిన సిబ్బంది ఆటలో ఓడిపోయిన వారిని తుపాకీతో కాల్చి చంపుతారు. 9 ఎపిసోడ్లలో సాగే ఈ సిరీస్​ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠతో అలరిస్తుంది(squid game north korea news). 456 మందిలో చివరకు ఒక్కరే విజేతగా నిలుస్తారు.

ఇదీ చదవండి: China population: పెళ్లికి యువత 'నో'.. జనాభా సంక్షోభంలో చైనా!

Last Updated :Nov 25, 2021, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.