ETV Bharat / international

ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలో 8 మంది మృతి

author img

By

Published : Apr 1, 2021, 4:53 PM IST

పాకిస్థాన్​లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టగా ఈ దుర్ఘటన జరిగింది.

8 family members killed in car-truck collision in Pakistan
ఘోర రోడ్డు ప్రమాదం- ఒకే కుటుంబంలో 8 మంది మృతి

ఓ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్​లోని పంజాబ్​ రాష్ట్రంలో జరిగింది.

ఇదీ జరిగింది

ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది బరవాలా నుంచి లాహోర్​కు కారులో వెళ్తున్నారు. అదుపు తప్పిన కారు.. లుదాన్​ ప్రాంతం వద్ద రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.

సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. మృతదేహాలను బరవాలా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.

ఈ ఘటనపై పంజాబ్​ సీఎం ఉస్మాన్​ బుజ్​దార్​ విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కరోనా విలయం: రాత్రిళ్లూ మృతదేహాల ఖననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.