ETV Bharat / international

నైజీరియా భవన ప్రమాదంలో 20కి చేరిన మృతులు

author img

By

Published : Nov 3, 2021, 8:46 AM IST

Updated : Nov 3, 2021, 9:54 AM IST

నైజీరియాలోని లాగోస్ నగరంలోని 21 అంతస్తుల భవనం కుప్పకూలిన (building collapse latest news) ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

building collapse latest news
కూలిన భవనం

నైజీరియా, లాగోస్​ నగరంలోని 21 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో (building collapse today) మృతుల సంఖ్య 20కి చేరింది. 9మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల్లో ఇంకా చాలా మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

building collapse latest news
శిథిలాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

లాగోస్​ నగరంలో 21 అంతస్తుల భవన నిర్మాణం గత ఏడాదిగా జరుగుతోంది. కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా భవనం సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. అధిక సంఖ్యలో కూలీలు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

building collapse latest news
ఘటనాస్థలిలో బాధితుల ఆవేదన
building collapse latest news
కుప్పకూలిన 21 అంతస్తుల భవనం

ఇదీ చదవండి: ఇథియోపియాలో జాతీయ అత్యయిక స్థితి

Last Updated : Nov 3, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.