ETV Bharat / international

సోమాలియాలో ఆత్మాహుతి దాడి- ఏడుగురు దుర్మరణం

author img

By

Published : Nov 28, 2020, 5:45 AM IST

Somalia blast
ఆత్మాహుతి దాడి

సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ ఐస్​క్రీమ్​ పార్లర్​పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అమెరికా రక్షణ మంత్రి క్రిస్టోపర్​ మిల్లర్​ పర్యటన ముగిసిన కొద్ది సమయానికే దాడి జరగటం గమనార్హం.

బాంబు పేలుడుతో సోమాలియా రాజధాని మొగదిషు ఉలిక్కిపడింది. నగరంలోని ఓ ఐస్​క్రీమ్​ పార్లర్​పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

సోమాలియాలోని అగ్రరాజ్య దౌత్యవేత్త, మిలిటరీ అధికారులను కలిసేందుకు శుక్రవారం.. మొగదిషులో పర్యటించారు అమెరికా రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి క్రిస్టోపర్​ మిల్లర్​. ఆయన నగరం నుంచి వెళ్లిన కొద్ది సమయంలోనే ఆత్మాహుతి దాడి జరిగటం గమనార్హం.

ఈ ఘటనకు ఆల్​ఖైదా అనుబంధ సంస్థ ఆల్​ సబాబ్​ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేసింది.

ఇదీ చూడండి:'ఉగ్రవాదంపై భారత్​తో కలిసి పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.