ETV Bharat / entertainment

అడివి శేష్​ వింత ట్వీట్​.. అర్థం తెలియక నెటిజన్ల బుర్రలు బద్దలు!

author img

By

Published : May 30, 2023, 7:37 AM IST

Updated : May 30, 2023, 8:03 AM IST

తన లేటెస్ట్ ట్వీట్​తో అభిమానులనే కాదు సెలబ్రిటీలను సైతం కన్​ఫ్యూజన్​లో పడేశారు టాలీవుడ్ స్టార్​ హీరో అడివి శేష్​. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

adivi sesh latest tweet
adivi sesh latest tweet

Adivi Sesh Tweet : టాలీవుడ్​ యంగ్ హీరో అడివి శేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్​ ఇప్పుడు నెట్టింట తెగ హల్​చల్​ చేస్తోంది. "వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం?" అంటూ ఆయన రాసిన ట్వీట్​కు అర్థం తెలియక నెటిజన్లే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు సైతం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆయన ఈ టైమ్​లో ఎందుకిలా ట్వీట్​ చేశారంటూ ఆలోచనలో పడిపోయారు. కొంత మంది సెలబ్రిటీలు ఈ పోస్ట్​కు కామెడీగా కామెంట్లు పెట్టారు.

ఈ ట్వీట్‌కు స్పందిస్తూ నటుడు రాహుల్ రవీంద్రన్ .. 'శేష్ ఏం చెబుతున్నాడు వెన్నెల కిషోర్.. ఏదో రహస్యంగా చెబుతున్నాడు. కొంపతీసి మనగురించేనా? అని కామెంట్ చేయగా.. దీనికి వెన్నెల కిషోర్ రాహుల్‌కి రిప్లయ్ ఇచ్చారు. అవన్నీ ట్రాఫిక్​ కోట్స్​ అవి.. ప్రశాంతంగా ఉండి.. కిందకి స్క్రోల్​ చేయండి' అని రాసుకొచ్చారు. వీరి సంభాషణ నవ్వులు పూయించింది. దీనికి ప్రముఖ సింగర్​ చిన్మయి కూడా ఎమోజీలతో రియాక్ట్ అయింది. అభిమానులు సైతం ఈ పోస్ట్​పై ఫన్నీగా కామెంట్స్​ చేస్తున్నారు.

  • Occhina daari ne chooskokapothe, mundhunna daarini ela sarididdhukuntaam?

    — Adivi Sesh (@AdiviSesh) May 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Adivi Sesh Movies : ఇక శేష్​ సినీ కెరీర్​ విషయానికి వస్తే.. హిట్​ 2 సినిమాతో మంచి టాక్​ అందుకున్న శేష్​.. 'జీ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేష్​ సినిమాల్లో సూపర్​ హిట్​ టాక్​ అందుకున్న గూడఛారి సినిమాకు సీక్వెల్​గా ఇది తెరకెక్కుతోంది. ఇటీవలే అడివి శేష్​ అరుదైన ఘనత అందుకున్నారు. 'మేజర్'​ మూవీని చూసిన భారత మాజీ రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్​.. శేష్​తో పాటు మూవీ యూనిట్​ను తన నివాసానికి పిలిచి సత్కరించారు. సినిమా బాగుందంటూ కొనియాడారు. దీంతో భావోద్వేగానికి లోనైన శేష్​.. ట్విట్టర్​ వేదికగా కోవింద్​కు కృతజ్ఞత తెలిపారు.

'గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌జీని కలవడం విశేషం. 'మేజర్‌' సినిమాపై ఆయన స్పందించిన తీరుతో పొంగిపోయాను. ఆయనతో మంచి సంభాషణ జరిగింది. త్వరలో మేజర్​ మొదటి వార్షికోత్సవం జరగనుంది. ఇప్పటికీ మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్​ మమ్మల్ని ఆశీర్వదిస్తునే ఉన్నారు. ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా 'మేజర్' రికార్డుకెక్కింది. మేజర్​ సందీప్​ ఉన్నీ కృష్ణన్​ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిత్ర బృందాన్ని కొనియాడారు.

adivi sesh latest tweet
భారత మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో మేజర్​ టీమ్​
Last Updated : May 30, 2023, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.