ETV Bharat / entertainment

'దుబాయ్​లో గొడవ, చంపుతామని బెదిరింపులు'- పూజా హెగ్డే టీమ్ క్లారిటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 4:25 PM IST

Updated : Dec 14, 2023, 7:12 AM IST

pooja hegde threats
pooja hegde threats

Pooja Hegde Threats : టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు బెదిరింపులు వచ్చాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరలైంది. దీనిపై స్పందించిన పూజా పర్సనల్ టీమ్, ఆ వార్తలు అబద్దం అని క్లారిటీ ఇచ్చింది.

Pooja Hegde Threats : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు మరణ బెదిరింపులు వచ్చాయన్న పుకార్లను ఆమె టీమ్ కొట్టిపారేసింది. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హీరోయిన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. "ఈ అబద్దపు ప్రచారాలు ఎవరు ప్రారంభించారో తెలియదు. అదంతా పూర్తిగా అవాస్తవం" అని పూజా టీమ్ చెప్పింది.

ఇదీ జరిగింది : హీరోయిన్ పూజా ఓ క్లబ్​ ఓపెనింగ్​లో పాల్గొనేందుకు ఇటీవల దూబాయ్ వెళ్లింది. అయితే అక్కడ క్లబ్​ ఈవెంట్​లో ఆమె గొడవ పడిందని, ఈ కారణంగా హీరోయిన్​కు హత్యా బెదిరిపులు వచ్చాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. దీంతో పూజ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే పూజ టీమ్ క్లారిటీ ఇవ్వడం వల్ల, అభిమానులు హ్యాపీ ఫీలౌవుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఫేక్​ పోస్ట్​ను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు.

'నాకు అందులో అకౌంట్ లేదు' లోకేశ్
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫేస్​బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుధవారం సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ విషయంపై గంటల్లోనే లోకేశ్ స్పందించారు. ఆయనకు అసలు ఫేస్​బుక్ అకౌంట్​ లేదని స్పష్టం చేశారు.' అందరికి హాయ్! నేను ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​లో మాత్రమే అందుబాటులో ఉంటా. ఈ రెండు తప్పా నాకు ఇతర సోషల్ మీడియా అకౌంట్​లు ఏవీ లేవు. సో అందరూ రిలాక్స్ అవ్వండి. ఒకవేళ వీటిలో తప్ప, వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్​లో నా పేరుతో ఉన్న అకౌంట్​ ఫాలో అవుతున్నట్లైతే, వెంటనే అన్​ఫాలో కొట్టేయండి' అని లోకేశ్ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

  • Hey all, I’m only available on Twitter and Instagram, I do not have or use any other social media accounts. Please feel free to ignore and unfollow any other hoax accounts!

    — Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Leo Box Office Collection : లోకేశ్ రీసెంట్​గా విజయ్ దళపతితో లియో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటించింది. ఇక అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్లపై పడలేదు. వరల్డ్​వైడ్​గా లియో దాదాపు రూ. 550 కోట్ల వసూళ్లు చేసింది.

మెగాస్టార్​ సినిమాలో త్రిష! - 17 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్!

బుట్టబొమ్మ టాలీవుడ్​ రీ ఎంట్రీ - ఆ ఇద్దరిలో ఎవరితో జోడీ కట్టేనో?

Last Updated :Dec 14, 2023, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.