ETV Bharat / entertainment

ఒకే వేదికపై చిరు-బాలయ్య​​​.. హోస్ట్​గా మంచు విష్ణు.. ఫ్యాన్స్​ సర్​ప్రైజ్​!

author img

By

Published : Dec 30, 2022, 7:48 AM IST

'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్​.. ఈ రెండు మూవీస్​ ప్రమోషన్స్​ కోసం ఓ భారీ స్పెషల్​ ప్లాన్​ వేస్తున్నట్లు సోషల్​మీడియాలో టాక్ నడుస్తోంది. ఒకే వేదికపై చిరు-బాలయ్యను చేర్చే విధంగా ఓ బిగ్ ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Chiranjeevi Balakrishna
ఒకే వేదికపై 'వాల్తేరు', 'వీరసింహా' ప్రమోషన్స్​​.. హోస్ట్​గా మంచు విష్ణు!

2023 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యగా చిరు, వీరసింహారెడ్డిగా బాలయ్య సందడి చేయనున్నారు. ఈ చిత్రాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీస్ మేకర్సే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థ.. రెండు సినిమాలను ఒకేసారి ప్రమోట్ చేసేందుకు వినూత్నమైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ బిగ్​ ఈవెంట్​ను ప్లాన్​ చేసి ఒకే వేదికపై చిరు-బాలయ్యను చేర్చాలని భావిస్తోందట. ఇకపోతే ఈ అగ్ర కథనాయకులిద్దరు కూడా మంచి స్నేహితులే. అలా వీరిద్దరిని కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా ఆలోచిస్తుందట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ వార్త జోరుగా ప్రచారం కావడం వల్ల మెగా-నందమూరి ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు.

మంచు విష్ణు హోస్ట్​గా.. ఇకపోతే మరో క్రేజీ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'వాల్తేరు' మూవీటీమ్​ నిర్వహించబోయే ప్రీ రిలీజ్​​ ఈవెంట్​కు 'మా' అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆయనే హోస్ట్ చేయనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో కూడా నిజమెంతో తెలియదు గానీ మెగా ఫ్యాన్స్ అంతా సర్​ప్రైజ్​ అవుతున్నారు.

ఇదీ చూడండి: Tollywood 2022: క్రేజ్​ పెరిగింది.. రేటు మారింది.. కానీ ఆఖరిలో మాత్రం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.