ETV Bharat / entertainment

అమిగోస్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​.. వారిపై ఎన్టీఆర్​ సెటైర్లు!

author img

By

Published : Feb 5, 2023, 11:00 PM IST

Updated : Feb 6, 2023, 6:50 AM IST

ntr 30 movie updates
ntr 30 movie updates

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా అమిగోస్. ఆషికా రంగనాథ్ హీరోయిన్​. రాజేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్​..'NTR 30' సినిమా గురించి సూపర్​ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్​ డేట్​తో పాటు.. ముందుగా అనుకున్న తేదీ ప్రకారం సినిమా విడుదల చేస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఫ్యాన్స్​పై పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు.

టాలీవుడ్​ కథానాయకుడు కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించిన సినిమా అమిగోస్. ఆషికా రంగనాథ్ హీరోయిన్​. కొత్త డైరెక్టర్ రాజేంద్ర దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు.. ఈ చిత్రంపై అంచనాలు పెంచేశారు. బింబిసార సినిమా తర్వాత మరో సరికొత్త కథతో కళ్యాణ్ రామ్ వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ హైదారాబాద్​లోని జేఆర్​సీ కన్వెన్షన్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్​ ఎన్టీఆర్​ హాజరయ్యారు.

'అమిగోస్​'లో యూనిక్​ పాయింట్​ ఉంది..
ఈ సందర్భంగా కథానాయకుడు కళ్యాణ్‌ రామ్ మాట్లాడారు. "తెలుగులో ద్విపాత్రాభినయం, రాముడు భీముడు సినిమాతో మా తాతగారు చేశారు. ఆ తరువాత అదే టైటిల్‌తో బాబాయ్ కూడా చేశారు. చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాను చేశారు. ఈ అన్నింట్లో ఒకే కామన్ పాయింట్. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ అమిగోస్‌లో మాత్రం.. యూనిక్ పాయింట్‌ను చూడబోతోన్నారు. మనుషులను పోలిన మనుషులు ఉంటారనే యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఇది కచ్చితంగా మిమ్మల్ని నిరాశపర్చదు. దర్శకుడు రాజేంద్ర ఓ కొత్త పాయింట్‌ను ఎంచుకున్నాడు."

"బింబిసారా తరువాత మళ్లీ కొత్త కథ చేయాలని అనుకున్నాను. అలాంటి సమయంలోనే అమిగోస్ కథ విన్నాను. కొత్త కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. బింబిసారా టైంలో చెప్పినట్టుగానే ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా డిజప్పాయింట్ చేయదు. కాలర్ ఎగరేసుకుని చెబుతున్నాను. బ్రహ్మాజీ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించారు. ఆశికకు తెలుగు ఇండస్ట్రీ తరుపున వెల్కమ్ చెబుతున్నాను. నేను వేసిన ప్రతీ అడుగులో నాకు తోడున్న నా తమ్ముడు, నా గుండెకాయ ఎన్టీఆర్‌కు థాంక్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమా రాబోతోంది. కచ్చితంగా మీకు కొత్త అనుభూతినిస్తుంది. కొత్త కమర్షియల్ సినిమాను చూడబోతోన్నారు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జై హింద్' అని అన్నారు."

'NTR 30' విడుదల అప్పుడే.. జూనియర్​ ఎన్టీఆర్​ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "ఈ సినిమా ప్రారంభించి, పూర్తి చేసేలోపు దర్శకుడు రాజేంద్ర తల్లిదండ్రులు కాలం చేశారు. సినిమా మీద ఇంత డెడికేషన్‌ ఉన్నందుకైనా ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి. ఈ తొలి సక్సెస్‌ను వారి తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. మైత్రీ వాళ్లను నా నిర్మాతలు అని అనేకంటే.. వారు నా శ్రేయాభిలాషులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. నేను, కొరటాల శివ వారి మీద జోకులు వేసుకుంటాం. సుడితో వచ్చారని అనుకుంటాం. సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసి.. రెండు హిట్ కొట్టడం వారికే సాధ్యమైంది. అదే ఊపులో అమిగోస్ హిట్ అయి.. హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆషికాకు తెలుగు ఇండస్ట్రీ తరుపున స్వాగతం. ఆమె ఇంకా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాలి. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణమైన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్.

కళ్యాణ్‌ రామ్ అన్న బాలగోపాలం సినిమా చేశాడు. నాకంటే ఆయనే సీనియర్. మా కుటుంబంలో ఎంత మంది హీరోలున్నా ప్రయోగాలు చేసింది మాత్రం కళ్యాణ్‌ అన్నే. హీరోగా, నిర్మాతగా ఇలా అన్ని రకాలుగా కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చారు. కమర్షియల్ సినిమాలు ఎప్పుడు చేస్తారని అనుకున్నాను. పటాస్, అతనొక్కడే వంటివి చేశారు. బింబిసారాతో పూర్తిగా ఆకలి తీర్చారు. మూడు పాత్రలను పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను కూడా జై లవకుశలో మూడు పాత్రలు వేశాను. తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని అందరికీ తెలుసు. సినీ అభిమానుల వల్లే ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ అనేది జక్కన్న విజయం. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలి. సినిమా అప్డేట్ కోసం మీ ఆరాటం, తాపత్రయం మాకు అర్థమవుతోంది. మీ వల్ల దర్శక నిర్మాతలకు ఒత్తిడి ఏర్పడుతుంది. దాని వల్ల అందరికీ నష్టం కలుగుతుంది. అప్డేట్ ఉంటే.. ఇంట్లో మా భార్య కంటే మీకే ముందుగా చెబుతాం. ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో ఉన్నాం. మంచి సినిమా అందించాలని అనుకుంటాం. మంచి సందర్భం కోసం చూశాం. ఫిబ్రవరిలో సినిమా(NTR 30)ను ప్రారంభిస్తాం. మార్చి 20న షూటింగ్ ప్రారంభిస్తాం. 2024 ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తాం' అని అన్నారు.

Last Updated :Feb 6, 2023, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.