ETV Bharat / crime

కాలకృత్యాల కోసం వెళ్లిన మహిళ అదృశ్యం

author img

By

Published : Apr 13, 2021, 9:05 AM IST

women missing at sangareddy district
కాలకృత్యాల కోసం వెళ్లిన మహిళ అదృశ్యం

కాలకృత్యాల కోసం వెళ్లి ఓ మహిళ అదృశ్యమైనట్లు ఆమె భర్త సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈనెల 11న రాత్రి సమయంలో బయటకు వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదని తెలిపాడు.

కాలకృత్యాల కోసం వెళ్లి ఓ మహిళ అదృశ్యమయింది. తన భార్య ఎంతకీ ఇంటికి రాకపోవడం వల్ల ఆందోళనకు గురైన భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.

ఛత్తీస్​గడ్​కు చెందిన దిలీప్​కుమార్​ జంగ్డే తన కుటుంబంతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం కిష్టారెడ్డిపేటలోని సాయిరాం కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా మేస్తీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈనెల 11న రాత్రి తన భార్య ఊర్మిళ జంగ్డే కాలకృత్యాలకు బయటకు వెళ్లినట్లు తెలిపాడు. ఎంతకీ తిరిగి రాకపోవడం వల్ల చుట్టుపక్కల వెతికినట్లు చెప్పాడు. ఆచూకీ దొరకకపోవడం వల్ల అమీన్​పూర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు ఇచ్చినట్లు దిలీప్​ తెలిపాడు.

ఇవీచూడండి: మత్తు కేసులో మరికొందరు తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.