ETV Bharat / crime

దంపతుల ఉసురు తీసిన టిప్పర్.. ఆఫీస్​కి వెళ్లొస్తుండగా ప్రమాదం

author img

By

Published : Apr 17, 2021, 3:40 PM IST

విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. పటాన్​చెరు జాతీయ రహదారిపై బైక్​పై వెళ్తున్న దంపతులను టిప్పర్​ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

wife and husband died in road accident
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. దంపతులు శ్రీధర్​, దీపిక.. శాంతి నగర్​ కాలనీలో నివాసముంటున్నారు. కార్యాలయం నుంచి తిరిగివస్తుండగా రహదారిపై శ్రీనగర్ వెళ్లే కూడలి సమీపంలో వారిని టిప్పర్​ ఢీ కొట్టింది. భర్త అక్కడికక్కడే చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఆమె కూడా మృతిచెందింది.

ఇదీ చదవండి: లైంగిక వేధింపుల కేసు: నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.