ETV Bharat / crime

Father Suicide After Son's Death : కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

author img

By

Published : Dec 19, 2021, 10:07 AM IST

Updated : Dec 19, 2021, 11:33 AM IST

khammam suicide case
khammam suicide case

10:04 December 19

Father Suicide After Son's Death : కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

Father Suicide After Son's Death : కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాయి భానుప్రకాశ్‌ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 14న స్నేహితులతో కలసి సాయి జన్మదిన వేడుకలు చేసుకున్నాడు. ఈ విషయమై సాయిని పాఠశాల యాజమాన్యం మందలించింది. వారం పాటు సస్పెండ్‌ చేసింది.

Khammam Suicide News : తండ్రి రాంబాబు సైతం సాయిని మందలించారు. పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపం చెందిన సాయి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి రాంబాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి: lovers suicide: పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

Last Updated :Dec 19, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.