ETV Bharat / crime

స్నేహితులతో సరదాగా స్నానానికి వెళ్లి.. చెరువులో గల్లంతయ్యాడు..

author img

By

Published : Mar 18, 2022, 6:38 PM IST

Updated : Mar 18, 2022, 7:36 PM IST

స్నానానికి వెళ్లి.. చెరువులో ముగ్గురు గల్లంతు
స్నానానికి వెళ్లి.. చెరువులో ముగ్గురు గల్లంతు

18:34 March 18

స్నానానికి వెళ్లి.. చెరువులో ఓ వ్యక్తి గల్లంతు

సరదాగా స్నేహితులతో కలిసి చెరువుకు స్నానం కోసం వెళ్లారు. అందరూ కలిసి నీళ్లలో కేరింతలు కొట్టారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ నీరే వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుల్చుతాయని తెలుసుకోలేక పోయారు. స్నానానికి వెళ్లిన నలుగురిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రేగులగండిలో చోటుచేసుకుంది.

గల్లంతైన యువకుడు కూనవరం వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Last Updated :Mar 18, 2022, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.