ETV Bharat / crime

అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు.. 300 బస్తాలు సీజ్

author img

By

Published : May 4, 2021, 9:21 AM IST

pds rice seized by police and enforcement officers , ration rice seized
రేషన్ బియ్యం పట్టివేత, పీడీఎస్ బియ్యం పట్టివేత

కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం గుట్టును మక్తల్​లో అధికారులు, పోలీసులు బయటపెట్టారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి దాదాపు 300 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. వీటి విలువ రూ.ఆరు లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎన్ని మార్గాల్లో తరలించినా పట్టుకుంటామని నారాయణ పేట జిల్లా ఎన్​ఫోర్స్​మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

మక్తల్ నుంచి ఓ లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు, మక్తల్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు 300 బియ్యం బస్తాలతో ఉన్న లారీని సీజ్ చేశారు. పట్టుబడిన ఈ రేషన్ బియ్యం విలువ దాదాపు రూ.ఆరు లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఇదీ చదవండి: నీళ్లు తాగితే.. ఈ సమస్యలుండవట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.