ETV Bharat / crime

జీహెచ్ఎంసీ జోనల్​ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. పలు దస్త్రాలు దగ్ధం

author img

By

Published : Jan 12, 2022, 3:22 PM IST

Updated : Jan 12, 2022, 5:09 PM IST

జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. పలు దస్త్రాలు దగ్ధం
జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. పలు దస్త్రాలు దగ్ధం

15:21 January 12

జీహెచ్ఎంసీ జోనల్​ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. పలు దస్త్రాలు దగ్ధం

జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. పలు దస్త్రాలు దగ్ధం

సికింద్రాబాద్ జీహెచ్​ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులోని పన్ను విభాగంలో మంటలు చెలరేగడంతో దస్త్రాలు పూర్తిగా బూడిదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డీఆర్​ఎఫ్​ బృందాలు 3 అగ్నిమాపక వాహనాల సాయంతో మంటలను ఆర్పారు.

పరుగులు తీసిన ఉద్యోగులు

ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. భయంతో మూడో అంతస్తులోని సిబ్బంది కిందకు దిగిరాగా.. ఐదో అంతస్తులోని సిబ్బంది టెర్రస్​ పైకి పరిగెత్తారు. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. క్రేన్​ సాయంతో టెర్రస్​పై ఉన్న ఉద్యోగులను కిందికి దించారు.

విద్యుదాఘాతమే కారణం..

విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. అగ్నిప్రమాదంలో ఉద్యోగులకు ఎలాంటి గాయాలు కాలేదని.. అందరిని సురక్షితంగా కాపాడినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:

Last Updated :Jan 12, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.