ETV Bharat / crime

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం

author img

By

Published : Apr 16, 2021, 1:42 PM IST

suspicious dead body
అనుమానాస్పద స్థితిలో మృతదేహం

వికారాబాద్‌ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మొద్దులుగుట్ట తండా వద్ద కుళ్లిన మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం వద్ద పర్సు లభించిన ఆధారాల ప్రకారం మృతుడు మార్పల్లి మండలం కేంద్రానికి చెందిన సురేష్(25)గా గుర్తించారు. అతడిని ఎవరైనా హత్యా చేశారా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: ప్రమాదంలో ఇద్దరు మృతి.. అటుగా వెళ్తోన్న ఎంపీ నామ చూసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.