ETV Bharat / crime

Murder in Srikakulam: డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో పట్టపగలే దారుణ హత్య

author img

By

Published : Mar 26, 2022, 4:40 PM IST

murder at srikakulam
murder at srikakulam

Murder in Srikakulam: శ్రీకాకుళం పట్టణం గూణపాలెంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఇద్దరు వ్యక్తులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Murder in Srikakulam: శ్రీకాకుళం పట్టణం గోనపాలెంలో నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఘటన జరిగింది. ప్రత్యర్థులు.. ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో కరుణ్‌ రాజ్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాకి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో పట్టపగలే దారుణ హత్య

ఇదీ చదవండి: 'ఉగాది తర్వాత కేంద్రంపై ఉద్ధృత పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.