ETV Bharat / crime

అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టిన మేనత్త.. దెబ్బలు తాళలేక..!

author img

By

Published : Sep 4, 2022, 4:04 PM IST

అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టిన మేనత్త.. దెబ్బలు తాళలేక..!
అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టిన మేనత్త.. దెబ్బలు తాళలేక..!

AUNT BEATEN HER NEPHEW: తరచూ అల్లరి చేస్తున్నాడనే కోపంతో ఓ మేనత్త తన పదేళ్ల మేనల్లుడిని ఇష్టానుసారంగా కొట్టింది. దెబ్బలు తాళలేక ఆ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

AUNT BEATEN HER NEPHEW: చిన్న పిల్లలన్నాక అల్లరి చేయడం సహజం. ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో చిలిపి చేష్ఠలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో పెద్దవారు ప్రేమతో దగ్గరకు తీసుకుని మంచి మాటలు చెప్పి వారిని తీర్చిదిద్దాలి. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ.. అల్లరి చేస్తున్నాడని ఇష్టానుసారంగా కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని వైఎస్సార్​ కడప జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్​ జిల్లాలోని ఓంశాంతి నగర్​కు చెందిన శివయ్య, భాగ్యమ్మ అనే భార్యాభర్తలు జీవనోపాధి కోసమని నెల రోజుల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ పదేళ్ల కుమారుడు అయాన్​ను బాలుడి మేనత్త ఇంట్లో వదిలిపెట్టారు. అయితే బాలుడు తరచూ అల్లరి చేస్తున్నాడని విసుగు చెందిన అతని మేనత్త.. అయాన్​ తొడ వద్ద కాల్చింది. దాంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన బంధువులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మేనత్త, మామ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బాలుడి మేనత్త, మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి..:

రీల్స్​ చేయబోయాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.