రీల్స్​ చేయబోయాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

By

Published : Sep 4, 2022, 3:47 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

Train Accident Viral Video: సోషల్​ మీడియా వేదికగా ఫేమస్​ అయ్యేందుకు కొందరు చేస్తున్న పనులు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తున్నా.. అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇన్​స్టా, మోజ్​ వంటి వాటిల్లో లైకులు, ఫాలోవర్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందుకోసం కొందరు ప్రాంక్​ వీడియోల పేరిట జనాల ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు కదులుతున్న రైలు, బైకులపై సెల్ఫీలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇలాంటి పనే చేసి ఆసుపత్రి పాలయ్యాడు. వడ్డేపల్లికి చెందిన అజయ్‌ అనే యువకుడు ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్​ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్​ పక్కన వీడియో చేస్తుండగా ఖాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్​ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.