ETV Bharat / city

Uttam on Grain purchase: 'యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి'

author img

By

Published : Nov 29, 2021, 4:57 PM IST

Uttamkumar reddy on Grain purchase
Uttamkumar reddy

Uttam kumar reddy on Grain purchase: తెలంగాణ ప్రభుత్వం వల్లే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆలస్యం అవుతోందని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు లోక్​సభలో కేంద్రం జవాబు ఇచ్చినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా నాటకాలాడుతూ రైతులను గోస పెడుతున్నాయని ధ్వజమెత్తారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు.

Uttam kumar reddy on Grain purchase: వరి ధాన్యం కొనుగోళ్లు, గిరిజనుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో ముందుకుపోతున్నా.. తెలంగాణ ప్రభుత్వం భూ కేటాయింపుల్లో అలసత్వం వల్లే.. వర్సిటీ ఏర్పాటు ఆలస్యం అవుతోందని.. లోక్​సభలో కేంద్రం జవాబిచ్చిందని ఉత్తమ్​ తెలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే గిరిజన యూనివర్సిటీ ఆలస్యమవుతోందని ఆరోపించారు. భాజపా, తెరాసకు గిరిజనుల పట్ల ఎంత ఆసక్తి ఉందో దీనిద్వారా స్పష్టమవుతోందని విమర్శించారు.

తెలంగాణ వరి రైతులకు తెరాస, భాజపా ప్రభుత్వాలు శాపంగా మారాయని ఉత్తమ్​ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా నాటకాలాడుతూ రైతులను గోస పెడుతున్నాయని ధ్వజమెత్తారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు.

Uttam on farm laws:వ్యవసాయ చట్టాల రద్దుపై కాంగ్రెస్​ చర్చకు పట్టుబట్టినా.. ఎలాంటి చర్చ లేకుండానే సాగు చట్టాల రద్దు బిల్లులను లోక్​సభలో ఆమోదించారని ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. ఇది దురదృష్టకర పరిణామమన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపుల్లో ఆలస్యం వల్లే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఈ మేరకు లోక్​సభలో కేంద్రం చెప్పింది. తెరాస, భాజపాలు వరి రైతులకు శాపంగా మారాయి. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వామే కొనుగోలు చేయాలి.'

ఉత్తమ్​కుమార్​రెడ్డి, కాంగ్రెస్​ ఎంపీ

Uttamkumar reddy on Grain purchase: 'యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి'

ఇదీచూడండి: 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.