- బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా..
బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. న్యాయవాది చేత బండి సంజయ్కి నోటీసులు పంపించారు.
- కాంగ్రెస్కు 'లీకుల' భయం.. 'చింతన్ శిబిర్'లో ఫోన్లు బ్యాన్!
పార్టీ నేతలంతా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. చింతన్ శిబిర్ సమావేశాల సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన సోనియా.. మోదీ పాలన కొనసాగితే... భవిష్యత్లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న సీఎం సమీక్ష
CM Review Meeting: ఈనెల 18న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి వర్గం, అధికారులతో కేసీఆర్ చర్చించనున్నారు.
- 'పబ్లు, బార్ల యజమానులు బాధ్యతాయుతంగా మెలగాలి.. లేకపోతే..'
హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం నేపథ్యంలో నగర కమిషనర్ సీవీ ఆనంద్ నగరంలోని పబ్, బార్, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ల యజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పబ్, బార్, డ్రవ్ ఇన్ రెస్టారెంట్ల యజమానులు బాధ్యతాయుతంగా మెలగాలని సీపీ హెచ్చరించారు.
- 'డబ్బులు ఇమ్మని కరాటే కల్యాణి బెదిరించింది.. ఇవ్వనంటే కొట్టింది..'
కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డి మధ్య జరిగిన దాడి వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్రెడ్డి చేసే వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి.. అతడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీయటంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
- బ్యాంకులో నగదు మాయం కేసు.. క్యాషియర్ ప్రవీణ్ వాహనం గుర్తింపు
Bank Of Baroda Cashier case: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం కేసులో నిందితుడిగా ఉన్న క్యాషియర్ ప్రవీణ్ బైక్ను పోలీసులు గుర్తించారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ప్రవీణ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- 'జ్ఞాన్వాపీ కేసుతో భయంగా ఉంది'.. కుటుంబ భద్రతపై జడ్జి ఆందోళన
Gyan vapi case: జ్ఞాన్వాపీ కేసు విచారణ చేపడుతున్న న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ దివాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు భయానక వాతావరణాన్ని నెలకొల్పిందని, దీంతో తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించారు.
- మరో బాంబు పేల్చిన మస్క్- ట్విట్టర్ డీల్కు బ్రేక్!
Elon Musk Twitter deal: ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్.. మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్లో ఫేక్ అకౌంట్ల లెక్కపై స్పష్టత వచ్చే వరకు ఈ డీల్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
- స్టేట్ బ్యాంక్కు లాభాల సునామీ
SBI profit 2022: భారతీయ స్టేట్ బ్యాంక్కు లాభాల పంట పండింది. నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ ఏకంగా రూ.9,114 కోట్లు లాభం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది 41శాతం అధికం కావడం విశేషం.
- పింక్ చుడిదార్లో బొద్దుగా కత్రినా.. ప్రెగ్నెంట్ అయ్యిందంటూ..!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గర్భవతి అంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడతున్నాయి. తాజాగా ఆమె కనిపించిన తీరు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై కత్రినా టీమ్ ఏమన్నదంటే?