ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు, ఇద్దరు మృతి

author img

By

Published : Dec 6, 2020, 10:03 AM IST

తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,73,341 మందికి మహమ్మారి సోకింది.

Newly 622 corona cases in the state, two dead
రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. కరోనా నుంచి మరో 993 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,73,341 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,472 మందిని మహమ్మారి బలి తీసుకుంది.

ఇప్పటి వరకు మొత్తం 2,63,744 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,125 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 6,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 104 కరోనా కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.