ETV Bharat / city

Kerala Invites Kavitha: ఎమ్మెల్సీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం

author img

By

Published : May 24, 2022, 4:24 PM IST

Kerala Invites Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేరళ అసెంబ్లీ నుంచి ఆహ్వానం అందింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి 27 వరకూ తిరువనంతపురంలో జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్‌ జరగనుంది. ఈ నెల 26న కాన్ఫరెన్స్​లో కవిత పాల్గొననున్నారు.

Invitation to kavita from Kerala Assembly
కేరళ అసెంబ్లీ నుంచి కవితకు ఆహ్వానం

Kerala Invites Kavitha: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేరళ అసెంబ్లీ నిర్వహించనున్న జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్​లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈనెల 25 నుంచి 27 వరకూ తిరువనంతపురంలో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 26న "నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిథ్యం" అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. అదే అంశంపై ఎమ్మెల్సీ కవితతో పాటు.. ఉత్తరాఖండ్ గవర్నర్ రీటా ఖండూరీ, అన్నీ రాజా సైతం ప్రసంగించనున్నారు‌. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా కేరళ ఎంపీ రేమ్యా హరిదాసు వ్యవహరించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.

ఇవీ చదవండి: మోదీ హైదరాబాద్‌ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు.. వారిపై ముందస్తు చర్యలు

త్వరలోనే హైదరాబాద్​కు వస్తా..: దావోస్​లో కేటీఆర్​తో మహారాష్ట్ర మంత్రి

'జనాలెవ్వరూ.. ప్రైవేటు ఆస్పత్రి, డయగ్నోస్టిక్​ సెంటర్లకు వెళ్లొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.