ETV Bharat / city

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

author img

By

Published : Aug 22, 2022, 6:21 PM IST

Traffic Jam
Traffic Jam

Traffic Jam in Hyderabad హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సభ జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాదారులు ట్రాఫిక్​లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Traffic Jam in Hyderabad: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సభ జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో అబిడ్స్, నాంపల్లి, లిబర్టీ, బషీర్​బాగ్ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్​లో చిక్కుకుపోయి నిలిచిపోవడం వల్ల వాహనదారులు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సాయంత్రంపూట కావడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న వారు, విద్యార్థులు, ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.