ETV Bharat / city

చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..

author img

By

Published : Jun 7, 2020, 1:56 PM IST

లాక్​డౌన్​ సడలింపుల ఫలితంగా ప్రజల రాకపోకలు అధికమయ్యాయి. కొన్ని చోట్ల లాక్​డౌన్​ నిబంధలను బాగానే అమలువుతున్నా.. బహిరంగ మార్కెట్లలో మాత్రం అసలు కరోనా ఉందా అనేలా ప్రజలు వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం సూత్రాన్ని గాలికొదిలేస్తున్నారు.

fish market
చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..

మృగశిర కార్తెను పురస్కరించుకుని రాష్ట్రంలో ఇవాళ చేపల విక్రయాలు జోరందుకుంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్‌.. జనంతో కిక్కిరిసింది. చేపల ధరలు రెండింతలు చేసి అమ్ముతున్నారని.. వినియోగదారులు ఆరోపించారు. మూడు కిలోలు కొనే చోటా 2 కిలోలు కొనుగోలు చేసినట్లు వివరించారు. లాక్​డౌన్​ సడలింపులతో కరోనా కేసులు పెరుగుతుంటే.. ప్రజలు మాత్రం భౌతిక దూరం నిబంధన గాలికొదిలేసి.. మాస్కుల మాటే మరచి చేపలు కొనేందుకు ఎగబడ్డారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కొవిడ్​-19 కేసులు నమోదవుతున్నా.. లాక్​డౌన్​ నియమాలు గాలికొదిలేశారు ప్రజలు.

చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..

ఇవీచూడండి: కరోనా వేళ.. చేపల కోసం పోటెత్తిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.