ETV Bharat / city

GRMB Meeting: నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం..

author img

By

Published : Apr 27, 2022, 5:16 AM IST

Godavari River water Board meeting today at hyderabad jalasoudga
Godavari River water Board meeting today at hyderabad jalasoudga

GRMB Meeting: రెండు మార్లు వాయిదా అనంతరం నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా నేడు జీఆర్​ఎంబీ భేటీ కానుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్​లపై భేటీలో చర్చించనున్నారు.

GRMB Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు నేడు మరోమారు సమావేశం కానుంది. ఇప్పటికే రెండు సార్లు జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడగా... తాజాగా మూడోమారు భేటీ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో సమావేశాన్ని మార్చి 11, ఏప్రిల్ 22 తేదీల్లో ఛైర్మన్ ఎంపీ సింగ్ వాయిదా వేశారు. త్వరలోనే మరోమారు సమావేశం నిర్వహిస్తామని ఛైర్మన్ ప్రకటించగా.. ఆ భేటీని ఇవాళ నిర్వహిస్తున్నట్లు గోదావరి బోర్డు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.

హైదరాబాద్ జలసౌధ వేదికగా నేడు జీఆర్​ఎంబీ సమావేశం జరుగనుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్​లపై భేటీలో చర్చించనున్నారు. తెలంగాణకు చెందిన చనాకా - కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్​లు, ఆంధ్రప్రదేశ్​కు చెందిన వెంకటనగరం పంప్​హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్​లపై సమావేశంలో చర్చ జరుగనుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.