ETV Bharat / city

మహిళను బలికొన్న జీహెచ్​ఎంసీ వాహనం..

author img

By

Published : Mar 3, 2020, 1:47 PM IST

హైదరాబాద్​ కుషాయిగూడ పోలీస్ స్టేషన్​ పరిధిలోని రాధిక చౌరస్తా వద్ద ఓ మహిళను జీహెచ్​ఎంసీ లారీ ఢీ కొట్టింది. మహిళ మృతదేహం నుజ్జయింది. హెల్మెట్​ ధరించినా ప్రాణాలు దక్కలేదు.

ghmc lorry accident
మహిళను బలికొన్న జీహెచ్​ఎంసీ వాహనం.. నుజ్జయిన మృతదేహం

హైదరాబాద్​ కుషాయిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రాధిక చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న మహిళను జీహెచ్​ఎంసీ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సౌందర్య అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హెల్మెట్​ ధరించినా ప్రాణాలు దక్కలేదు.

స్థానికులు లారీ డ్రైవర్​ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు శానిటేషన్​ విభాగంలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళను బలికొన్న జీహెచ్​ఎంసీ వాహనం.. నుజ్జయిన మృతదేహం

ఇవీచూడండి: బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.