ETV Bharat / state

బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం

author img

By

Published : Mar 2, 2020, 8:02 PM IST

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

bike accident
బస్సు ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామం వద్ద పెద్దపల్లి నుంచి గోదావరిఖని వెళ్తున్న ఆర్టీసీ బస్సు, మంథని వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం

ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.