ETV Bharat / city

CPM Leaders fire on BJP: 'కేసీఆర్​ మెతక వైఖరే భాజపా బలోపేతానికి కారణం'

author img

By

Published : Jan 13, 2022, 3:49 PM IST

Updated : Jan 13, 2022, 4:28 PM IST

CPM Leaders fire on BJP: హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం నాయకులు సమావేశమయ్యారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నట్టు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ వైఖరే భాజపా బలోపేతానికి కారణమవుతోందని.. కేంద్రంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

CPM Leaders fire on BJP for doing injustice to two Telegu states
CPM Leaders fire on BJP for doing injustice to two Telegu states

'కేసీఆర్​ మెతక వైఖరే భాజపా బలోపేతానికి కారణం'

CPM Leaders fire on BJP: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. ప్రజల హక్కులను కాలరాస్తోందని సీపీఏం పోలిట్​ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నాయకులు మండిపడ్డారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పార్టీ బహిరంగ సభ వర్చువల్​గా ఈ నెల 22న నిర్వహిస్తామని... ప్రతినిధుల సభలు భౌతికంగా 23 నుంచి జరుగుతాయని తెలిపారు.

హామీలు విస్మరించి విద్వేషాలు..

దేశంలో నిత్యావసరాల ధరలు నియంత్రించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాఘవులు విమర్శించారు. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలపై ఇతర పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థను రక్షించుకునేందుకు కేసీఆర్, జగన్ కలిసి రావాలని కోరారు. పార్టీ విధానాలు నచ్చక రాజీనామా చేసిన నేతలపై పాత కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.

"కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. భాజపా విధానాలు నచ్చక ఉత్తరప్రదేశ్ మంత్రి మౌర్య రాజీనామా చేసి ఎస్పీలోకి వెళ్లితే పాత కేసులు పెట్టి వేధిస్తోంది. ప్రత్యర్థులపై ఇలాంటి వేధింపులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు నిలవాలి. ధరలను నియంత్రించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. డీజిల్, పెట్రోల్ మీద కేంద్రం ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటోంది. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలపై ఇతర పక్షాలతో కలిసి పోరాటం చేస్తాం. సమాఖ్య వ్యవస్థకు కేంద్రం విఘాతం కలిగిస్తోంది. సమాఖ్య వ్యవస్థను రక్షించేందుకు కేసీఆర్, జగన్ కలిసి రావాలి.. లేకపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయి. ఇందుకోసమే కేంద్ర నాయకులు తెలంగాణ సీఎం కేసీఆర్​ను కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భాజపా తీవ్ర అన్యాయం చేసింది. విభజన హామీలను విస్మరించి... విద్వేషాలు రెచ్చగొడుతోంది. ఏపీలో జిన్నా టవర్, తెలంగాణలో భాగ్యనగర్ పేరుతో భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోంది." - బీవీ రాఘవులు, సీపీఏం పోలిట్​ బ్యూరో సభ్యులు

భాజపా విషయంలో కేసీఆర్​ది​ మెతక వైఖరి..

సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలన అప్రజాస్వామికంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో భాజపా ప్రమాదకరంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భాజపాను నిలువరించడంలో కేసీఆర్ మెతక వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై సీఎం కేసీఆర్​ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని.. లేకపోతే మహాసభల తరువాత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు.

"ప్రజా జీవితానికి, అభివృద్ధికి భాజపా ఆటంకం కలిగిస్తోంది. భాజపాను నిలువరించేందుకు సీపీఎం రాష్ట్ర నాయకత్వం పని చేస్తుంది. భాజపాను నిలువరించడంలో సీఎం కేసీఆర్ మెతక వైఖరి అవలంభిస్తున్నారు. లీకులు ఇచ్చి కేసీఆర్ భాజపా స్పందన గమనిస్తున్నారు. కేంద్రంపై కేసీఆర్​ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. లేకపోతే మహాసభల తరువాత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తాం. కేసీఆర్ ఏడేళ్ల పాలన అప్రజాస్వామికంగా ఉంది. ఆర్థిక స్వావలంభన, ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారు. లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 30 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రశ్నించే వాళ్లను అణిచివేస్తున్నారు. కేసీఆర్ దొరల పోకడలో వెళ్తున్నారు.. ఇలాంటి వైఖరి సరైంది కాదు. కేసీఆర్ వైఖరే భాజపా బలోపేతానికి కారణమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 317జీవోను ఉప సంహరించుకోవాలి. విద్యుత్ ఛార్జీలు పెంచాలనుకోవడం సరైంది కాదు... తక్షణమే విరమించుకోవాలి. భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఎవరితోనైనా కలిసి పని చేస్తాం." - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఇదీ చూడండి:

Last Updated :Jan 13, 2022, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.