ETV Bharat / city

'రాయలసీమ సరే.. రంగారెడ్డి పరిస్థితితేంటీ కేసీఆర్​..!'

author img

By

Published : Aug 27, 2019, 10:22 PM IST

ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని అనుమతి కోరితే అరెస్టులు చేయడం దారుణమని కాంగ్రెస్​ నేతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలంటూ పాదయాత్రకు ప్రయత్నించిన వికారాబాద్​ కాంగ్రెస్​ కార్యకర్తలను, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామంటున్నారని.. మరీ నీళ్లు లేని రంగారెడ్డిని ఎందుకు మరిచిపోతున్నారని విమర్శించారు.

'రాయలసీమ సరే.. రంగారెడ్డి పరిస్థితితేంటీ కేసీఆర్​..!'


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మధ్య, చిన్న తరహా నీటి పథకాలను అభివృద్ధి చేయాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్​కుమార్​, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్ల సమస్యపై పాదయాత్రకు ప్రయత్నం చేస్తే అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. తమ ప్రాంతంల్లో ఎకరానికి లక్షలు ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నారని.. తాము కూడా తెలంగాణలో ఉన్నామని.. సాగునీరివ్వాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి డిమాండ్​ చేశారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానంటున్నారని.. కానీ రంగారెడ్డి జిల్లాను మరిచిపోతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు చేసినా అనుమతులిచ్చామని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రకు ప్రయత్నం చేస్తే అనుమతులివ్వకుండా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ఎన్నికల ముందు చంద్రబాబు తమతో కలిస్తే విమర్శించారని.. ప్రస్తుతం జగన్​కు నీళ్లిస్తామంటున్నారని.. ఇదే ద్వంద్వ వైఖరని విమర్శించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్​ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్​రెడ్డి పాదయాత్ర చేయాలని అనుమతి కోరితే అరెస్టు చేయడం దారుణమన్నారు. వెంటనే వారందరినీ విడుదల చేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.

'రాయలసీమ సరే.. రంగారెడ్డి పరిస్థితితేంటీ కేసీఆర్​..!'

ఇవీ చూడండి: రైతుల పొలాలు పచ్చగా.. కాంగ్రెస్​ నేతల కళ్లు ఎర్రగా..

TG_Hyd_25_27_Congress_On_KCR_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) నీళ్ల కరువు ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మధ్య తరహా,చిన్ననీటి పథకాలను అభివృద్ది చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా పోలాలకు నీళ్లు కావాలని పాదయాత్ర కోసం ప్రయత్నం చేస్తే అరెస్టులు చేయడం బాధాకరమని నేతలు ఆక్షేపించారు. మీ ప్రాంతంలో ఎకరానికి లక్ష ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నారని...మేము కూడా తెలంగాణలో ఉన్నామని మాకు సాగునీరివ్వాలని సీఎం కేసీఆర్ నుద్దేశించి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డితో కలిసి అయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి రత్నాల సీమ చేస్తానంటున్నారని...మమ్ములను ఎందుకు మరిచిపోతున్నారని అయన ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల కోసం పాదయాత్ర చేస్తామంటే అరెస్టు చేస్తున్నారని....కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ఉ ఎన్ని ఉద్యమాలు చేసినా అనుమతులు ఇచ్చామని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. ఎన్నికల ముందు తమతో చంద్రబాబు తమతో కలిస్తే విమర్శించారని...ఇప్పుడేమో జగన్‌ను కలిసి నీళ్లు ఇస్తామంటున్నారని ఇదే ద్వంద వైఖరని విమర్శించారు. ఇలాగే చేస్తే తెలంగాణలో అంతర్యుద్దాలు వస్తాయన్నారు. కేసీఆర్‌ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలని భావిస్తే అరెస్టు చేసి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించిన అయన వెంటనే వారందరిని విడుదల చేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. బైట్‌: కొండా విశ్వేస్వర రెడ్డి, మాజీ ఎంపీ బైట్: ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి బైట్: వంశీ చంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.