ETV Bharat / city

జాంబాగ్​లో తెరాస, ఎంఐఎం వర్గీయుల మధ్య ఘర్షణ

author img

By

Published : Dec 1, 2020, 4:36 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల వేళ పోలింగ్​ బూత్​ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. జాంబాగ్​ డివిజన్​లోని ఆగాపురాలో ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్​ చేస్తున్నారంటూ తెరాస అభ్యర్థి ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

clash between mim and trs in jambagh
clash between mim and trs in jambagh

హైదరాబాద్​లోని ఆగాపురాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ గౌడ్​పై ఎంఐఎం నాయకులు దాడికి యత్నించారు. జూబ్లీ హైస్కూలు పోలింగ్ భూత్​లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆందోళన చేపట్టారు.

ఎంఐఎం నాయకులను భూత్​ల నుంచి బయటకు పంపాలని పోలీసులను కోరినా... సహకరించడం లేదని ఆనంద్​గౌడ్​ ఆరోపించారు. పోలీసులు ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనగా... ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

జాంబాగ్​లో తెరాస, ఎంఐఎం వర్గీయుల మధ్య ఘర్షణ

ఇదీ చూడండి: గ్రేటర్​ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.