ETV Bharat / city

పులివెందులలో జరిగిన హత్యపై డీజీపీకి చంద్రబాబు లేఖ..

author img

By

Published : Oct 9, 2022, 1:28 PM IST

tdp chief cbn
తెలుగుదేశం అధినేత చంద్రబాబు

CBN Letter to AP DGP: ఏపీ డీజీపీకిి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలోని పులివెందులలో తెదేపా కార్యకర్త పరమేశ్వర్ రెడ్డి హత్య కేసులో నిందితులందరిని అరెస్టు చేయాలని లేఖలో పేర్కొన్నారు. 8 మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారన్న ఆయన.. ఈ కేసులో న్యాయం చేయాల్సిన బాధ్యత డీజీపీపైనే ఉందని అన్నారు.

CBN Letter to AP DGP: ఏపీలోని పులివెందులలో తమ కార్యకర్త పరమేశ్వర్ రెడ్డి హత్య కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. 2022 సెప్టెంబర్ 19న సింహాద్రిపురం మండలం, దిద్దెకుంట గ్రామానికి చెందిన పెద్దసోమప్ప పరమేశ్వర రెడ్డిని.. దారుణంగా హత్య చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

పల్లేటి హరినాథ రెడ్డి సహా 8 మందిపై పరమేశ్వరరెడ్డి కుమారుడు అదే రోజు ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే 8 మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసులో న్యాయం చేయాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చంద్రబాబు లేఖలో సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.