లైవ్ వీడియో.. వరదలో బస్సు బోల్తా.. లక్కీగా 50 మంది...

By

Published : Oct 9, 2022, 10:45 AM IST

thumbnail

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో బస్సు బోల్తా పడగా.. దాదాపు 50 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ష్యోపుర్ జిల్లా ఊంపచా గ్రామంలో శనివారం జరిగింది. జిల్లాలో కొద్దిరోజులుగా జోరు వర్షాలు కురుస్తుండగా.. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే.. బస్సు డ్రైవర్​ ఊంపచా దగ్గర్లోని వాగును దాటేందుకు యత్నించాడు. అనూహ్యంగా బస్సు పక్కకు ఒరిగిపోయింది. లోపలున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. పోలీసులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.