ETV Bharat / city

ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు.. 16 మరణాలు

author img

By

Published : Oct 29, 2020, 6:56 PM IST

ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 16 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,14,784కి చేరింది.

2,905 new corona cases reported in ap today, and 16 members died
ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు.. 16 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 88,778 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,905 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 16 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,14,784కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,659 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,243 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,84,752కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,268 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,62,459 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

ఇవీ చూడండి: డిసెంబర్‌ కల్లా సీరమ్‌ వ్యాక్సిన్‌: పునావాలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.