ETV Bharat / business

పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా..

author img

By

Published : Mar 16, 2023, 1:20 PM IST

today-gold-rate-hyderabad-and-vijayawada
ఈ రోజు బంగారం ధర

Gold Rate Today : దేశంలో బంగారం ధర పెరిగింది. వెండి ధర మాత్రం అలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర పెరిగింది. వెండి ధర మాత్రం అలాగే ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి.. ప్రస్తుతం 59,840 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర ఏమీ పెరగకుండా ప్రస్తుతం రూ.68,400 వద్ద కొనసాగతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.59,840 వద్ద కొనసాగుతోది. కిలో వెండి ధర 68,400 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,840గా ఉంది. కిలో వెండి ధర రూ.68,400 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,840 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,400గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర 59,840 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర రూ.68,400 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1914 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.70 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర 109.64 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా.. డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.20,29,148 పలుకుతుండగా.. ఇథీరియం, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మరికొన్నింటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.20,29,148
ఇథీరియంరూ.1,36,638
టెథర్​రూ.82.92
బైనాన్స్​ కాయిన్​రూ.26,070
యూఎస్​డీ కాయిన్రూ.82.64

నష్టాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు..
గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం 57,461 వద్ద కదలాడుతోంది. మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. 35 పాయింట్ల నష్టపోయి 16,936 వద్ద సూచీ ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి మారకం విలువ..
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గింది. ప్రస్తుతం ట్రేడింగ్​లో పదకొండు పైసలు తగ్గి 82.76 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.