ETV Bharat / business

పెట్రో మోత.. 10రోజుల వ్యవధిలో తొమ్మిదోసారి పెంపు

author img

By

Published : Mar 31, 2022, 6:50 AM IST

petrol diesel price increased again
పెట్రో మంట.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

Diesel Price today: దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 10 రోజుల వ్యవధిలో తొమ్మిదోసారి ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్​, డీజిల్ ధర ఎలా ఉందంటే..

Petrol Price Hike: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​, డీజిల్​పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్​, డీజిల్​ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్​ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఆంధ్రప్రదేశ్​లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్​లో లీటర్​ పెట్రోల్​ రూ.117.32, డీజిల్ రూ.103.10కి చేరింది. హైదరాబాద్​లో పెరిగిన ధరల అనంతరం లీటర్​ పెట్రోల్​ రూ.115.42, డీజిల్​ రూ.101.58గా ఉంది.

ఇదీ చదవండి: ఆధార్​-పాన్​ లింక్​ చేయలేదా? ఫైన్ తప్పదు! శుక్రవారమే మొదలు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.