ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. కొత్తగా ఎంతంటే?

author img

By

Published : Mar 21, 2023, 11:46 AM IST

gold-rate-today-gold-price-in-hydrabad-and-vijayawada
Gold prices in Telugu states

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.140 పెరిగి.. ప్రస్తుతం రూ.61,440గా ఉంది. కిలో వెండి ధర రూ.300 పెరిగి.. ప్రస్తుతం రూ.70,450 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,440 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర 70,450 రూపాయలుగా ఉంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,440గా ఉంది. కిలో వెండి ధర రూ.70,450 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,440 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,450గా ఉంది.

Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,440గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,450 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,982 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.50 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,98,016 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.22,98,016
ఇథీరియంరూ.1,43,866
టెథర్​రూ.82.82
బైనాన్స్​ కాయిన్​రూ.27,648
యూఎస్​డీ కాయిన్రూ.82.53

లాభాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య.. మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 166 పాయింట్ల లాభపడి 57,795 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు లాభంతో.. 17,034 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్అండ్‌టీ, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభాన్ని తగ్గించేందుకు ఫెడరల్ రిజర్వ్, ఇతర సెంట్రల్ బ్యాంకులు చర్యలు తీసుకుంటున్న కారణంగా.. మార్కెట్​లో కొంత సానుకూల ప్రభావాలు వెలువడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
రూపాయి మారకం విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పెరిగి.. 82.62 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.