ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా...

author img

By

Published : May 16, 2022, 9:57 AM IST

Updated : May 16, 2022, 10:04 AM IST

Gold Rate Today
బంగారం ధర

Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.30 వరకు వృద్ధి చెందింది. మరోవైపు వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,838 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,838 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,838 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,555 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,838గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,838గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,555 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,810 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.05 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ సహా ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,61,957
ఇథీరియంరూ.1,68,257
టెథర్రూ.81.64
బినాన్స్​ కాయిన్రూ.24,425
యూఎస్​డీ కాయిన్రూ.81.71

స్టాక్​ మార్కెట్ల జోరు: వరుస నష్టాలతో కుదేలైన దేశీయ స్టాక్​ మార్కెట్లు.. ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అమెరికా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు.. ఆటో, బ్యాంక్​, మెటల్​, పవర్​ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్​ 500 పాయింట్లకు పైగా వృద్ధితో 53,313 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 15,941 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఐచర్​ మోటార్స్​, జెఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా స్టీల్​, అపోలో హాస్పిటల్స్​, ఇండస్​ఇండ్ బ్యాంకు షేర్లు 2-4 శాతం వరకు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: 51 శాతం తగ్గిన బ్యాంకు మోసాలు.. కానీ అందులో మాత్రం..

Last Updated :May 16, 2022, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.