ETV Bharat / business

వెంటాడిన లాక్​డౌన్ భయాలు- 49000 దిగువకు సెన్సెక్స్

author img

By

Published : May 12, 2021, 3:39 PM IST

Updated : May 12, 2021, 3:58 PM IST

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు

రాష్ట్రాలవారీగా లాక్​డౌన్​తో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదన్న భయాల మధ్య​ బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 471 పాయింట్లకు పైగా క్షీణించింది. నిఫ్టీ​ 154 పాయింట్లు కోల్పోయింది.

కరోనా మహమ్మారి విజృంభణతో స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 471 పాయింట్లు నష్టపోయి 48,691 వద్ద సెషన్​ను ముగించింది. నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయి 14,697 వద్ద స్థిరపడింది.

దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ తరహా ఆంక్షలు అమల్లోకి రావడం, ఎన్నాళ్లుంటుందో తెలియని కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుందనే భయాలు మదుపర్లను వెంటాడాయి. ఫలితంగా సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 49,171 పాయింట్ల అత్యధిక స్థాయిని, 48,551 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 14,824 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,650 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

30షేర్ల ఇండెక్స్​లో టైటాన్, పవర్​గ్రిడ్, మారుతీ, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, డాక్టర్​ రెడ్డీస్, హెచ్​సీఎల్​ టెక్, ఏషియన్ పెయింట్స్, మినహా.. ఇతర షేర్లన్నీ భారీగా నష్టాల్లో సెషన్​ను ముగించాయి.

Last Updated :May 12, 2021, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.