ETV Bharat / business

మార్కెట్ల జోరుకు బ్రేక్​- 57,400 దిగువకు సెన్సెక్స్

author img

By

Published : Sep 1, 2021, 3:43 PM IST

గత సెషన్​లో రికార్డుస్థాయి లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 214 పాయింట్లు కోల్పోయి.. 57,400 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty today) 56 పాయింట్లు నష్టపోయింది.

STOCKS CLOSE
STOCKS CLOSE

వరుస లాభాలతో రికార్డుల మోత మోగించిన స్టాక్​ మార్కెట్ల జోరుకు బుధవారం బ్రేక్​ పడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 214 పాయింట్లు కోల్పోయి 57,338 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 56 పాయింట్ల నష్టంతో 17,076 వద్ద ముగిసింది.

వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకోవడం వల్ల సూచీలు నష్టాలను నమోదు చేసినట్లు నిపుణులు విశ్లేషించారు. బ్యాంకింగ్​ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 57,919 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 57,277 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,226 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 17,055 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎల్​ అండ్ టీ, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎం అండ్ ఎం, టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ప్రధానంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు బుధవారం సానుకూలంగా ముగిశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.