ETV Bharat / business

మళ్లీ రికార్డుల మోత- సెన్సెక్స్​ 123 పాయింట్లు జంప్

author img

By

Published : Aug 5, 2021, 3:45 PM IST

ఆరంభంలో నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 123 పాయింట్ల లాభంతో తొలిసారి 54,450 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 25 పాయింట్ల లాభంతో 16,300 మార్క్​కు చేరువైంది.

stocks market updates
స్టాక్ మార్కెట్​ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ (Sensex today) 123 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,493 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 36 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,294 వద్దకు చేరింది.

లాభాల స్వీకరణ కారణంగా ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. ఐటీ, హెవీ వెయిట్ షేర్ల దన్నుతో తిరిగి లాభాలను గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 54,717 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవితకాల గరిష్ఠం) 54,230 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,349 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,210 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​టెక్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్​ సిమెంట్ ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో నిక్కీ (జపాన్​).. మినహా.. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు నష్టాలతో ముగిశాయి.

ఇదీ చదవండి: గోల్డ్​పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.