ETV Bharat / business

రూపాయి క్షీణతతో పసిడి పైకి- నేటి ధరలు ఇలా..

author img

By

Published : Sep 8, 2020, 4:39 PM IST

రూపాయి పతనంతో పసిడి ధరలు పెరిగాయి. దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.122, వెండి కిలోకు రూ.340 పెరిగింది.

gold price
బంగారం ధర

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.122 పెరిగి రూ.51,989కు చేరుకుంది.

వెండి ధర కూడా కిలోకు రూ.340 పైకెగిసి రూ.69,665కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ధరలు స్థిరంగా ఉన్నా.. రూపాయి బలహీన పడటం వల్ల బంగారం పెరుగుదలపై ప్రభావం పడిందని రిలయన్స్​ సెక్యూరిటీస్​ సీనియర్​ విశ్లేషకులు శ్రీరామ్​ అయ్యర్​ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధర ఔన్సుకు 1,930 డాలర్లు, వెండి 26.91 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: లాభాలు ఆవిరి- సెన్సెక్స్ 52 పాయింట్లు పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.