ETV Bharat / business

లాభాలు ఆవిరి- సెన్సెక్స్ 52 పాయింట్లు పతనం

author img

By

Published : Sep 8, 2020, 3:43 PM IST

Updated : Sep 8, 2020, 4:32 PM IST

stocks close
స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ, విద్యుత్​ రంగ షేర్లతో మిడ్​ సెషన్​లో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్​ 52 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయాయి.

అంతర్జాతీయ ప్రతికూలతలు, లోహ రంగ షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. ఐటీ, విద్యుత్ రంగ షేర్ల దూకుడుతో వచ్చిన లాభాలు.. చివరి సెషన్​లో ఆవిరయ్యాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 52 పాయింట్లు నష్టపోయి 38,365 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11,317 పాయింట్లకు చేరింది.

ఐటీ, విద్యుత్​ షేర్ల దూకుడుతో మిడ్ సెషన్​లో 248 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్​.. 38,498 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

stocks close
మార్కెట్​ ముఖ్యాంశాలు..

లాభనష్టాల్లో..

హెచ్​సీఎల్​ టెక్​, ఇన్పోసిస్​, రిలయన్స్, టీసీఎస్​, ఐసీఐసీఐ, టెక్​మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు రాణించాయి.

టాటా స్టీల్​, భారతి ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్​, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ షేర్లు వెనకబడ్డాయి.

రూపాయి మారకం..

అంతర్జాతీయంగా రూపాయి మారకం విలువ మరింత బలహీనపడింది. డాలర్​తో పోలిస్తే 25 పైసలు తగ్గిన రూపాయి.. 73.63 వద్ద స్థిరపడింది.

ఆసియా మార్కెట్లు...

షాంఘై, జపాన్​, దక్షిణ కొరియా, హాంకాంగ్​ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.

చమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్​లో బ్రెంట్ క్రూడ్ ధర 1.55 శాతం పడిపోయి బ్యారెల్​కు 41.36 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లకు సెప్టెంబర్​లో ఒడుదొడుకులు!

Last Updated :Sep 8, 2020, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.