ETV Bharat / business

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Sep 4, 2021, 9:40 AM IST

gold price today
బంగారం తాజా ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర శనివారం స్వల్పంగా పెరిగింది. మరోవైపు.. వెండి ధర భారీగా పెరిగింది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) శనివారం స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధర(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే శనివారం స్వల్పంగా పెరిగింది. వెండి (Silver price today) ధర రూ.1800 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.400 వరకు పెరిగి రూ.49,080కు చేరింది. కేజీ వెండి ధర రూ. 66,740వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,080గా ఉంది. కిలో వెండి ధర రూ.66,740 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,080గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,740గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1826.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు స్పాట్ వెండి ధర 24.75 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) శనివారం ఎలాంటి మార్పు లేదు.

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.44గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.96.88 వద్ద కొనసాగుతోంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.39గా, లీటర్ డీజిల్ ధర రూ.97.33గా ఉన్నాయి.
  3. గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.66గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.60 వద్ద ఉంది.

ఇవీ చదవండి: Digital Gold: ఒక్క రూపాయితో బంగారం కొనొచ్చు.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.