ETV Bharat / business

సెప్టెంబర్​లో 7.34 శాతంగా సీపీఐ- కారణమిదే..

author img

By

Published : Oct 12, 2020, 6:57 PM IST

why Retail inflation rises in September
సెప్టెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత

రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ).. మళ్లీ కేంద్రం, ఆర్​బీఐ అంచనాలనుమించి భారీగా పెరిగింది. సెప్టెంబర్​లో 7.34 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్​లో ఇది 3.99 శాతంగా ఉండటం గమనార్హం.

రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ భారీగా పెరిగింది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగటం వల్ల సెప్టెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 7.34 శాతానికి పెరిగినట్లు జాతీయ గణాంక కార్యాలయం(ఎన్​ఎస్​ఓ) సోమవారం ప్రకటించింది.

సీపీఐ ఆగస్టులో 6.69 శాతంగా నమోదవ్వగా.. 2019 సెప్టెంబర్​లో 3.99 శాతంగా ఉండటం గమనార్హం.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో ఏకంగా 10.68 శాతానికి పెరిగినట్లు ఎన్​ఎస్​ఓ వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్​లో ఇది 9.05 శాతంగా ఉన్నట్లు వివరించింది.

ఇదీ చూడండి:పండుగలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.