ETV Bharat / business

ఐటీ రిటర్నుల​ దాఖలుకు గడువు పెంపు

author img

By

Published : Oct 24, 2020, 2:55 PM IST

Updated : Oct 24, 2020, 4:03 PM IST

Deadline for filing returns Extended
ఐటీఆర్ ఫైలింగ్​కు గడువు పెంపు

14:50 October 24

ఐటీఆర్ దాఖలుకు మళ్లీ గడువు పెంపు..

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్​) దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ గడువు నవంబర్ 30తో ముగియాల్సి ఉంది.

అడిట్ అవసరమైన వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ గడువును జనవరి 31వరకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

మేలోనూ గడువు పెంపు..

నిజానికి ఐటీఆర్ దాఖలు చేసేందుకు జులై 31 వరకే గడువు ఉంది. కరోనా నేపథ్యంలో ఈ గడువును నవంబర్ 30 వరకు పెంచుతున్నట్లు మేలో ప్రకటించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).

Last Updated :Oct 24, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.