ETV Bharat / business

మార్కెట్లకు స్వల్ప నష్టాలు- టెక్ మహీంద్ర షేర్లు 3.5% వృద్ధి

author img

By

Published : Sep 22, 2021, 3:36 PM IST

ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు(stock market today) ఆ తర్వాత ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, ఫార్మా, లోహ షేర్ల అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 58,927​ పాయింట్లు, నిఫ్టీ 17,546 పాయింట్లు వద్ద స్థిరపడ్డాయి.

stock market news
స్టాక్​ మార్కెట్​

స్టాక్​ మార్కెట్లు బుధవారం(stock market today) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77 పాయింట్లు కోల్పోయి 58,927 పాయింట్ల వద్ధ స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 17,546 వద్ద ముగిసింది.

ఉదయం సెషన్​ను లాభాలతోనే ఆరంభించిన సూచీలు(stock market news).. ఆ తర్వాత అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ఫార్మా, లోహ షేర్ల అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి(stock market news in telugu). చివరకు స్వల్ప నష్టాలను చవిచూశాయి.

కోల్ ఇండియా, టెక్​ మహీంద్ర షేర్లు 3.5శాతానికిపైగా వృద్ధి చెందాయి. హిందాల్కో, టాటా మోటార్ల్ ఎం&ఎం షేర్లు కూడా లాభాలతో ముగిశాయి

హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్ర, ఒఎన్​జీసీ షేర్లు ఒక శాతానికిపైగా నష్టపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.