ETV Bharat / business

పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ధరలు

author img

By

Published : Jun 4, 2021, 9:57 AM IST

దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల విరామం తర్వాత చమురు సంస్థలు పెట్రోల్​ డీజిల్​ ధరలను పెంచాయి. పెట్రోల్​పై 27పైసలు, డీజిల్​పై 28పైసలు పెరిగాయి.

petrol price increase, చమురు ధరలు
పెరిగిన చమురు ధరలు

రెండు రోజుల విరామం తర్వాత దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్​పై 27పైసలు, డీజిల్​పై 28పైసలు చొప్పున చమురు సంస్థలు ధరలు పెంచాయి. ఫలితంగా దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 94.76, డీజిల్ రూ.85.66కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.101.19, డీజిల్ రూ.93.09కు చేరింది.

హైదరాబాద్​లో పెట్రోల్ రూ.98.48, డీజిల్ రూ.93.38 ఉంది. విశాఖలో పెట్రోల్ రూ.99.90, డీజిల్​ రూ.94.23లకు ఎగబాకింది. గత నెలలో చమరు ధరలు 16 సార్లు పెరగ్గా.. ఈ నెలలో ఇప్పటివరకు రెండుసార్లు పెరిగాయి. 18 రోజుల్లో లీటర్ పెట్రోల్​పై రూ.4.36, డీజిల్​పై రూ.4.93 చొప్పున పెరిగింది.

ఇదీ చదవండి : రిలయన్స్​ సీఎస్​ఆర్​ నిధులు రూ.1,140కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.