బంగారం ధర శుక్రవారం మరింత తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price today) రూ.205 తగ్గి.. రూ.47,910 వద్దకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం బంగారం ధర తగ్గేందుకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర (Silver rate today) మాత్రం స్వల్పంగా రూ.61 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,521 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర (Gold price in International Market) 1,891 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.67 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.