ETV Bharat / bharat

పంచాయితీకి పిలిపించి మహిళపై కౌన్సిలర్​ గ్యాంగ్​రేప్​​​.. ఏడో తరగతి విద్యార్థిపై కాల్పులు!

author img

By

Published : Nov 5, 2022, 11:57 AM IST

Updated : Nov 5, 2022, 12:25 PM IST

Woman gangraped
మహిళపై గ్యాంగ్​ రేప్​

ఓ వ్యక్తి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అయితే.. దీన్ని ఆసరాగా తీసుకున్న స్థానిక కౌన్సిలర్​ పంచాయితీకి పిలిపించి ప్రియుడితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బంగాల్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో ఓ మైనర్ పాఠశాలలోకి చొరబడి విద్యార్థిపై కాల్పులు జరిపాడు.

బంగాల్​ ఖరగ్​పూర్​లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువకుడు ఓ మహిళను నమ్మించి మోసంచేశాడు. ఆ గొడవకు పరిష్కారం చూపిస్తానన్న స్థానిక టీఎంసీ కౌన్సిలర్..​ ఆమెను పార్టీ కార్యాలయానికి పిలిపించి అత్యాచారం చేసాడు. ఘటన జరిగిన మూడు నెలలు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే?
బంగాల్​ పశ్చిమ మదీన్​పుర్​ జిల్లాలోని ఖరగ్​పూర్​కు చెందిన ఓ మహిళ ఐదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయి.. తండ్రితో కలిసి ఒంటిరిగా జీవనం సాగిస్తుంది. అయితే.. ఆమె గత కొంత కాలంగా స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై పలు మార్లు అత్యాచారం చేసి అనంతరం ముఖం చాటేశాడు. ఈ గొడవకు పరిష్కారం చూపిస్తాని స్థానిక టీఎంసీ కౌన్సిలర్​ ముఖేశ్​ హుమ్నే జూలై 25న తన పార్టీ కార్యాలయానికి పిలిపించాడు. ఆ పంచాయితికి ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితుడు కూడా హాజరయ్యాడు. పరిష్కారం చూపిస్తానన్న పెద్ద మనిషితో సహా ఆ ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తామని ఆమెను బెదిరించాడు.

అయితే.. ఈ ఘటన జరిగి మూడు నెలలు కాగా.. తాజాగా మదీన్​పూర్​ ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు ఆమె ప్రియుడ్ని అరెస్ట్​ చేశారు. ముఖేశ్​ కొన్ని రోజుల క్రితం భాజపా నుంచి తృణమాల్​ కాంగ్రెస్​లోకి మారిపోయాడు. పార్టీ మారిన నుంచే.. అతడికి ఆ పార్టీ అలవాట్లు వచ్చాయని.. కౌన్సిలర్​ని కఠినంగా శిక్షించాలని భాజపా జిల్లా ప్రతినిధి అరూప్ దాస్ డిమాండ్ చేశారు.

విద్యార్థిపై కాల్పులు..

రాజస్థాన్​ ధోల్​పుర్ ఓ మైనర్​ తుపాకీతో హల్​చల్​ సృష్టించాడు. మొరోలి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రామ్​హరి అనే ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆ యువకుడు పారిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన.. రాంబరన్​ అనే వ్యక్తి కుమారుడు సచిన్​గా గుర్తించారు. అయితే ఆ విషయంపై బాధితుడు వాంగ్మూలం తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు.. వారి ఇద్దరి మధ్య ఏదైనా వివాదం ఉందా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

పశుగ్రాసం గొడవ.. దళిత కుటుంబంపై దాడి..
ఉత్తర్ ​ప్రదేశ్​లో 12 మంది గ్యాంగ్​స్టర్స్ కలిసి​ ఓ దళితుడి ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. కాన్పూర్​లోని బిల్హౌర్ ప్రాంతంలోని చక్తాపూర్​ గ్రామంలో.. పశుగ్రాసం విషయంలో ఓ దళిత కుటుంబానికి, మరొకరికి మధ్య గొడవ జరిగింది. పోలీసులు సైతం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

Last Updated :Nov 5, 2022, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.