ETV Bharat / bharat

మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్.. సుప్రీంకోర్టు చరిత్రలో మూడోసారి ఏర్పాటు

author img

By

Published : Dec 1, 2022, 2:18 PM IST

సుప్రీంకోర్టులో ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ ఏర్పాటు చేశారు.​ ఇలాంటి బెంచ్​ను ఏర్పాటు చేయడం సుప్రీం కోర్టు చరిత్రలో ఇది మూడో సారి.

supreme court all woman bench
supreme court

సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఓ బెంచ్​ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ ఏర్పాటు చేశారు.​ అత్యున్నత న్యాయస్థానంలోని కోర్ట్ నంబర్ 11లో ఉన్న ఈ బెంచ్​లోని న్యాయమూర్తులు జస్టిస్​ హిమా కోహ్లీ, జస్టిస్​ బేల ఎం త్రివేది వివాహ వివాదాలతో పాటు బెయిల్‌కు సంబంధించిన బదిలీ పిటిషన్లను విచారించనున్నారు.

2013లో తొలిసారిగా మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెంచ్​లో జస్టిస్‌ జ్ఞాన్‌ సుధా మిశ్రా, జస్టిస్​ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ ఉండేవారు. తర్వాత 2018లో జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్​ ఇందిరా బెనర్జీతో కూడిన మరో బెంచ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఏర్పడ్డది మూడో బెంచ్​. ప్రస్తుతం ఈ బెంచ్​ ముందు 32 పిటిషన్లు పెండింగ్​లో ఉన్నాయి. అందులో వివాహ సంబంధిత వివాదాలపై 10 బదిలీ పిటిషన్‌లతో పాటు 10 బెయిల్ పిటిషన్లు ఉన్నాయి.

సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు.. జస్టిస్ కోహ్లి, జస్టిస్​ బి.వి నాగరత్న, జస్టిస్​ త్రివేది. అయితే 2027 సీజేఐ రేసులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ నాగరత్న నియమితులయ్యే అవకాశముంది. వీరితో పాటు సీజేఐతో కలిపి సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.